దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19కి చేరగా, డీజిల్ ధర రూ.94.92కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్పై 34 పైసలు పెరిగి రూ.112.11కు, డీజిల్పై 37 పైసలు పెరిగి రూ.102.89కు చేరాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 38 పైసల చొప్పున పెరిగడంతో పెట్రోల్ ధర రూ.110.46కు, డీజిల్ ధర రూ.103.56కు చేరాయి. చెన్నైలో లీటరు పెట్రోలు రూ.103.31, డీజిల్ రూ.99.26, కోల్కతాలో పెట్రోల్ రూ.106.78, డీజిల్ రూ.98.03కు పెరిగాయి.