పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండిపోతుండంతో ఇబ్బందులు పడుతున్న జనాలకు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మరింత భారంగా మారుతోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్, డిజిల్పై 35 పైసల చొప్పున వడ్డించాయి.దీంతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.107.24కి చేరగా, డీజిల్ ధర రూ.95.97కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.113.12, డీజిల్ రూ.104కు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ రూ.107.78, డీజిల్ రూ.99.08, చెన్నైలో పెట్రోల్ రూ.104.22, డీజిల్ రూ.100.25కి పెరిగింది.తాజా పెంపుతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు 37 పైసలు అధికమై రూ.111.55కి చేరగా, డీజిల్పై 38 పైసలు అధికమై రూ.104.70కు పెరిగింది. ఇక నాలుగు రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.1కిపైగా పెరిగాయి. గత నెల 28 నుంచి ఈ నెల 23 వరకు 20 సార్లు ధరలు పెరిగాయి. దీంతో వాహనదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పనక్కరలేదు. అంటే 25 రోజుల్లో 20 సార్లు పెరిగినట్టు. ఈ 20 రోజుల్లో లీటరుకు రూ.5పైనే సామాన్యుడిపై భారం పడిరది. ఇక డీజిల్ విషయానికి వస్తే.. గత నెల 24 నుంచి ఈ నెల 23 వరకు దాదాపు 23 సార్లు ధరలు పెరిగాయి. అంటే 29 రోజుల్లో 23 సార్లు పెరిగినట్టు. ఈ 23 రోజుల్లో లీటరుకు రూ.7 పైనే పెరిగింది.