పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. సబ్సిడీయేతర గ్యాస్ బండపై రూ.25 మేర పెంచారు. ఈ ధరలు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల నేపథ్యంలో ప్రస్తుతం దిల్లీ, ముంబైలో 14.2 కిలోల సిలిండర్ రూ. 859.50కు చేరుకుంది. కోల్కతాలో సిలిండర్ ధర ఇప్పుడు రూ. 886కు చేరుకుంది. చెన్నైలో సిలిండర్ కోసం, వినియోగదారులు 850.50 కి బదులుగా రూ .875.50 చెల్లించాలి. హైదరాబాద్లో రూ.887లుగా ఉన్న గ్యాస్ ధర రూ.25 పెరిగి రూ.912కి చేరింది. సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల(ఎల్పీజీ ధర) ధరలను మారుస్తాయి.