గత జూన్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరోసారి కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ప్రియాంక ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అన్ని నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను ’’ అని ఆమె ట్వీట్ చేశారు. రెండు నెలల వ్యవధిలోనే ప్రియాంకకు మరోసారి కరోనా సోకడం గమనార్హం. కాగా, రాహుల్ గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఆయన రాజస్థాన్లోని ఆల్వార్లో పర్యటించాల్సి ఉంది. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన ఈ పర్యటనను వాయిదా వేసుకున్నారు.