పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులతో సతమతమవుతున్న ప్రజలకు మరో భారం పడిరది. చమురు కంపెనీలు ఇప్పుడు వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్పై భారీగా వడ్డించాయి. ఒకేసారి రూ.273.5 పెంచాయి. దీంతో హైదరాబాద్ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2460కి చేరింది. ఇక దేశరాజధాని న్యూఢల్లీిలో వాణిజ్య సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో రూ.2253కు చేరింది. అయితే ప్రస్తుతానికి గృహ అవసరాలకోసం వినియోగించే 14 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం కొంతలో కొంత ఊరటనిస్తున్నది. కాగా, గతనెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.105 మేర పెంచిన విషయం తెలిసిందే.