1.45 లక్షలకు చేరిన క్రియాశీల కేసులు..!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముందురోజు 15వేల మేర కొత్త కేసులు నమోదు కాగా..ఇప్పుడు ఆ సంఖ్య 5 వేల మేర పెరిగింది. కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,785 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,45,654 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18,517 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారని, 40 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గిందని, ఇప్పటివరకు 200.61 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.33 శాతమని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది.