Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మళ్లీ పెరిగిన ధర…కిలో గ్యాస్‌పై మొత్తం రూ.15 పెంపు

దేశంలో మరోసారి కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్జీ) ధరలు పెరిగాయి. గురువారం సీఎన్‌జీ కిలోకు రూ.2.5 పెరిగింది. ఢల్లీితో పాటు చుట్టుపక్కల నగరాల్లో గురువారం సీఎన్‌జీ ధర కిలోకు రూ.2.5 పెంచామని ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) తెలిపింది. ఏప్రిల్‌ 14వతేదీ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి.ఢల్లీిలో సీఎన్‌జీ కిలో రూ.71.60, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో రూ.74.17, ముజఫర్‌నగర్‌, మీరట్‌, షామ్లీలలో రూ. 78.84,గురుగ్రామ్‌ కిలో 79.94 రూపాయలకు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img