Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మళ్లీ మాస్కు ధరించాలి

పలు రాష్ట్రాల్లో ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలు
దేశంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు మరోసారి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ని తప్పనిసరి చేశాయి. నాల్గవ వేవ్‌ భయం నేపథ్యంలో దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, కేరళ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు మాస్కు ధరించాలనే ఆదేశాలను తిరిగి తీసుకువచ్చాయి. దిల్లీలో మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ఢల్లీి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీడీఎంఏ తెలిపింది.ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రాజధాని లక్నో, ఆరు ఎన్‌సిఆర్‌ జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఫేస్‌ మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోనూ మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. గురుగ్రామ్‌లో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా ఫరీదాబాద్‌, సోనిపట్‌, రaజ్జర్‌ జిల్లాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి చేసినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. అలాగే పంజాబ్‌, కర్నాటక ప్రభుత్వం ఫేస్‌ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ చేశాయి. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో మాస్క్‌లను తప్పనిసరి చేశాయి. గోవా రాష్ట్రంలోనూ తాజాగా ప్రజలు మాస్కులు ధరించాలని అక్కడి సర్కారు ఆదేశాలు జారీ చేసింది.ఛత్తీస్‌ ఘడ్‌, ఛండీఘడ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలోనూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయా రాష్ట్ర ఆరోగ్య శాఖల అధికారులు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img