Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని స్టార్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడిరచిన రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్‌ పూర్తిచేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కర్షక నాయకుడు ఎన్‌.జి.రంగా శిష్యులు. 1968, 74, 80లో వరుసగా మండలికి ప్రాతినిథ్యం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img