పంజాబ్లో కాల్పులు కలకలంరేపాయి. బఠిండా మిలిటరీ స్టేషన్లో జరిగిన ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. బఠిండాలోని మిలిటరీ స్టేషన్ లో.. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు శబ్దం రాగానే స్టేషన్లోని టీమ్లు అలర్ట్ అయ్యాయి.. కానీ అప్పటికే దుండగులు పారిపోయినట్లు తెలుస్తోంది.ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మిలటరీ స్టేషన్ ఆఫీసర్స్ మెస్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇక్కడే సైనికుల కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి. ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను అక్కడ మోహరించారు. మిటలరీ టీమ్లు కాల్పుల తర్వాత పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు. మిలిటరీ స్టేషన్ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. బఠిండా మిలటరీ స్టేషన్లో 10వ కోర్ కమాండ్కు చెందిన సైన్యం ఉంది. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో కొన్ని ఆయుధాలు మాయమైనట్లు చెబుతున్నారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.