Friday, April 19, 2024
Friday, April 19, 2024

మీ మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తోంది..

మోదీపై రాహుల్‌ గాంధీ ట్వీట్‌
బిల్కిస్‌ బానో రేపిస్టులను విడుదల చేయడంపై రాహుల్‌ ఆగ్రహం
దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించిన రాహుల్‌

బిల్కిస్‌ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాందీ తీవ్రంగా ఆక్షేపించారు. దీనిపై ప్రధాని మోదీ.. మహిళలకు ఏం చెప్తారని రాహుల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఇవాళ ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆజాదీ కే అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా 5 నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, ఆమె 3 ఏళ్ల బాలికను చంపిన వారిని విడుదల చేశారని, మహిళా శక్తి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. దేశ మహిళలకు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రధాని గారూ, మీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దేశం మొత్తం చూస్తోంది’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 2002 గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ఏడుగురిని హత్య చేసిన కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడిరది. అయితే, గుజరాత్‌ ప్రభుత్వం వీళ్లందరికి క్షమాభిక్ష ఇచ్చింది. ఈ పదకొండు మంది సోమవారం గోద్రా సబ్‌-జైలు నుండి బయటకు వచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img