సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సీఎం జగన్కు జనం గోడు వినే తీరిక లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రజా వినతులు స్వీకరించే ఆలోచన లేదని అన్నారు. సీఎంకి విన్నవించే అవకాశం లేక క్యాంప్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదని, ముళ్ళకంచెలు, పోలీస్ పహారా మధ్య మాత్రమే ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో అఖిలపక్ష సమావేశాలు లేవని, కేవలం నిర్బంధకాండలు, అణిచివేతలతో నియంత పాలన సాగుతోందని అన్నారు.