Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మూడు వేల పైనే కరోనా కొత్త కేసులు

దేశంలో కొత్తగా 3,157 పాజిటివ్‌ కేసులు
స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించగా, 2723 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో 86 శాతం మేర ఈ ఐదు రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఒక్క దిల్లీ వాటానే 47.04 శాతంగా ఉంది.. మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అదేవిధంగా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇక ఇప్పటివరకు 1,89,23,98,347 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో ఆదివారం 4,02,170 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img