Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మెడికల్‌ హబ్‌గా కాశీ : ప్రధాని మోదీ


పూర్వాంచల్‌లో కాశీ క్షేత్రం మెడికల్‌ హబ్‌గా మారినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇవాళ మోదీ తన సొంత నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన బనారస్‌ హిందూ యూనివర్సిటీలో మాట్లాడుతూ, పూర్వాంచల్‌లో కాశీ క్షేత్రం మెడికల్‌ హబ్‌గా మారినట్లు తెలిపారు. ఒకప్పుడు కాశీ ప్రజలు చికిత్స కోసం ఢల్లీి లేదా ముంబై వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఇక్కడే అన్ని సౌకర్యాలు ఉన్నట్లు చెప్పారు. విపత్కర సమయాల్లో ఆగిపోమని, అలసిపోమని కాశీ పట్టణం నిరూపించిందన్నారు. కాశీతో పాటు యూపీ రాష్ట్రమంతా ప్రమాదకర వైరస్‌ మ్యుటేషన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. యూపీలో అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇక్కడే అత్యధిక సంఖ్యలో టీకాలు ఇస్తున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img