కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు
వక్ఫ్ భూములపై సమగ్ర అధ్యయనం
విజయవాడ`గుంటూరు ప్రాంతంలో హజ్హౌస్
సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి : మైనార్టీలకూ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఈ శాఖలో పెండిరగ్ సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక తక్షణమే అంద జేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్ డెవలప్మెంట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. కర్నూలులో ఉర్దూ వర్శిటీ పనులను నాడు-నేడు తరహాలో చేపట్టాలని, ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతోపాటు, భూములపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు. వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు, వక్ఫ్ ఆస్తులను కూడా సర్వే చేయాలని సూచించారు. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మైనార్టీలకు కొత్త శ్మశానవాటికల ఏర్పాటునకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వాటి నిర్మాణాలు చేపట్టాలని, ఇమామ్లు, మౌజమ్, పాస్లర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉర్దూ అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనార్టీశాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మైనార్టీ శాఖలో ఖాళీపోస్టుల నియామకాలను, ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విజయవాడ-గుంటూరు పరిసరాల్లో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆదేశించారు. హజ్, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని, అలాగే గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. మైనార్టీ విద్యార్థుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 5గురుకుల, 2 వసతి గృహాలకు సంబంధించి నిర్మాణంలో ఉన్న భవనాలకు బిల్లులు పెండిరగ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడిరచగా, తక్షణమే ఆ బిల్లులను చెల్లించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ కె.శారదా దేవి, ఏపీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సీఈఓ పి.రవి సుభాష్, ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ అలీం బాషా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.