Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

యజ్ఞంలా చెట్ల పెంపకం

పచ్చతోరణంగా తీర్చిదిద్దుదాం
33శాతం పచ్చదనం కోసం కృషి
అందరూ భాగస్వాములు కావాలి
జగనన్న పచ్చతోరణం`వన మహోత్సవంలో సీఎం జగన్‌

గుంటూరు : రాష్ట్రాన్ని పచ్చతోరణంలా తీర్చిదిద్దేందుకు చెట్ల పెంపకాన్ని యజ్ఞంలా చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం(ఎయిమ్స్‌) ఆవరణలో జగనన్న పచ్చతోరణం-వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్‌ గురువారం పాల్గొన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో జగనన్న పచ్చతోరణంవన మహోత్సవంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. ఎయిమ్స్‌ ఆవరణలో రావి, వేప మొక్కలను సీఎం జగన్‌ నాటారు. అనంతరం జగన్‌ మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని చెప్పారు. చెట్లు ఉంటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 33శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం 23 శాతం మాత్రమే పచ్చదనం ఉందని తెలిపారు. సభకు హాజరైన వారితో జగన్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలో సమతుల్యస్థితి అవసరాన్ని గుర్తిస్తూ… ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని ఊరూవాడా, ఇంటా బయటా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నానని, అందరం దీనికి కట్టుబడి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img