Friday, April 19, 2024
Friday, April 19, 2024

పెట్రోల్‌ ధరలు పైపైకి..ఇవాళ 90 పైసలు పెంపు…

దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సవరణలో భాగంగా ఇవాళ లీటర్‌ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.61 కాగా, డీజిల్‌ ధర రూ. 99.83గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ రూ. 115.37, డీజిల్‌ రూ. 101.23గా ఉంది.ఢల్లీిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.21, డీజిల్‌ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్‌ రూ. 115.04, డీజిల్‌ రూ. 99.25, చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.94, డీజిల్‌ ధర రూ. 96, కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 109.68, డీజిల్‌ ధర రూ. 94.62గా ఉంది.
కాగా పెంచిన పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు నిన్న డిమాండు చేశాయి. ఈ సమస్యపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధమే కారణమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. జీరోఅవర్లో లోక్‌సభలో కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ ఎంపీలు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు, వేతన జీవుల జేబులు గుల్లవుతున్నాయని విమర్శించారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో చర్చించాలని, దీనికి ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుందో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img