9వేలమందికి ఇంటర్నెట్ కట్ .. ఆఫ్లైన్లోకి 5,800 విండ్ టర్బైన్లు
పారిస్ : యూరప్లో భారీ సైబర్ దాడి జరిగింది. దీంతో వేలాది మందికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. జర్మనీ, సెంట్రల్ యూరప్లోని 5,800 విండ్ టర్బైన్లు కూడా ఆఫ్లైన్లోకి వెళ్లడంతో 11 గిగావాట్ల ఉత్పత్తిపై ప్రభావం పడిరది. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యల నేపథ్యంలో యూరప్పై సైబర్ దాడి జరగవచ్చు అని విశ్వసనీయ వర్గాలు హెచ్చరించాయి. కాగా, యూరప్ వ్యాప్తంగా అంతర్జాల సేవలకు తీవ్ర విఘాతం కలిగిందని ‘ఆరెంజ్’ తెలిపింది. అమెరికా శాటిలైట్ ఆపరేటర్ ఫిబ్రవరి 24 ఎట్ వియాశాట్పై సైబర్ దాడి జరిగిన క్రమంలో ఫ్రాన్స్లోని నార్డ్నెట్ శాటిలైట్ సేవలకు అంతరాయం కలిగినట్లు వెల్లడిరచింది. తత్ఫలితంగా దాదాపు తొమ్మిదివేల మంది వినియోగదారులకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు పేర్కొంది. బిగ్బ్లూ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ మాతృసంస్థ యుటెల్శాట్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు ఏఎఫ్పీ తెలిపింది. జర్మనీ, ఫ్రాన్స్, హంగేరీ, గ్రీస్, ఇటలీ, పోలండ్లోని బిగ్బ్లూకు చెందిన 40వేల మంది వినియోగదారుల్లో మూడవ వంతుకు ఈ సమస్య ఎదురైనట్లు వెల్లడిరచింది. అలాగే, జర్మనీ, సెంట్రల్ యూరప్లో 11 గిగావాట్ల సామర్థ్యం ఉన్న 5,800 విండ్ టర్బైన్లు ఆఫ్లైన్లోకి వెళ్లాయి. శాటిలైట్ కనెక్షన్కు తీవ్ర అంతరాయం కారణంగా రిమోట్ మానిటరింగ్, వేలాది విండ్ పవర్ కన్వర్టర్ల నియంత్రణ పరిమితంగా సాధ్యమవుతుందని జర్మనీకి చెందిన ఎనర్కాన్ తెలిపింది. విండ్ టర్బైన్లకు ప్రమాదం లేదు, శక్తి ఉత్పత్తి కొనసాగుతుందని, రిమోట్ ద్వారా రీసెట్ చేయడం మాత్రం కుదరదని పేర్కొంది.