ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా ఖురేషిపై రాంపూర్ జిల్లా సివిల్ లైన్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను రక్తం పీల్చే రాక్షసుడితో పోలుస్తూ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేష్ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ గవర్నర్ వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుందని, మతపరమైన అల్లర్లకు కూడా దారితీస్తుంది అని.తన ఫిర్యాదులో పేర్కొన్నారు.మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 124ఎ (సెడిషన్), 153ఎ , 153బి,505 (1) ( బి) సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు పెట్టారు.