ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరుపై కలత చెందిన చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంటు ఒక దేవాలయం లాంటిదని , కానీ కొందరు సభ్యులు సభలో అమర్యాదగా ప్రవర్తించారన్నారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే అన్నారు. ఈ పరిణామాలు తలుచుకుంటే రాత్రి నిద్రపట్టలేదు, చాలా దురదృష్టకరమైన పరిస్థితని అన్నారు. మంగళవారం రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు సభ చైర్మన్ స్థానం వద్దకు దూసుకెళ్లారు. కొద్ది రోజుల నుంచి కూడా ఎంపీలు ఇదే తీరును ప్రదర్శించారు. ఓ ఎంపీ ఏకంగా చైర్మన్ సీటుపైకి ఫైల్స్ విసిరేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్రంగా కలత చెందారు.