Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో ముఖ్యం

రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలోని హైలెట్స్‌..
రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో ముఖ్యమని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని కాపాడుకునే విషయంపై దృష్టి పెట్టామని తెలిపారు. కొద్ది రోజుల ముందే 75 ఏళ్ల స్వతంత్ర భారత ఉత్సవాలను ఘనంగ జరుపుకున్న విషయాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.విధాన లోపాన్ని అధిగమించి దేశం ముందుకెళుతోందని రాష్ట్రపతి చెప్పారు. దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా మారుతోందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని వివరించారు. ఆదాయ పన్ను విధానాన్ని తమ ప్రభుత్వం మరింత సరళతరం చేసిందని, పన్ను రిటర్నులు పొందడం కూడా ప్రస్తుతం సులభంగా మారిందని చెప్పారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోందని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. పౌర సేవల్లో సాంకేతికత ఎంతో ఉపయోగపడుతోందని వివరించారు. అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. బినామీ ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకున్నట్లు రాష్ట్రపతి వివరించారు. సరిహద్దుల్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని రాష్ట్రపతి చెప్పారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా దేశ సరిహద్దులు దాటి ముష్కరులను అంతమొందించామని గుర్తుచేశారు. దేశంలోని ప్రతీ ఇంటికీ మంచినీటిని చేర్చేందుకు తమ ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రారంభించిందని చెప్పారు. ట్రిపుల్‌ తలాక్‌, జమ్మకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
భారత్‌ పై ప్రపంచం ఆధారపడేలా మార్పు తెచ్చామని ముర్ము చెప్పారు. కరోనా కాలంలో కోట్లాదిమందిని తన ప్రభుత్వం ఆదుకుందని, పేదలకు అండగా నిలిచిందని తెలిపారు. రాబోయే రోజుల్లో పేదరికంలేని దేశ నిర్మాణం జరగాలని రాష్ట్రపతి ద్రైపది ముర్ము ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img