వైద్య నిపుణులు
కరోనా థర్డ్వేవ్ను దృష్టిలో ఉంచుకొని రాబోయే మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబరు- నవంబరు మధ్యకాలంలో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో పండుగలు, ఉత్సవాలు ఉన్నందున జనం ఒక చోట చేరే అవకాశాలున్నాయని, ఫలితంగా భౌతికదూరం అనేది కరువై వైరస్ వ్యాపించేందుకు అవకాశాలున్నాయన్నారు. ప్రజలంతా కరోనా ప్రొటోకాల్ పాటించాలన్నారు. ముమ్మర వ్యాక్సినేషన్ ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని చెబుతున్నారు.