నర్సు భావోద్వేగం
‘రాహుల్ నా బిడ్డ లాంటివాడు. మీరందరూ తనను చూడకముందే నేను చూశాను.’ అంటూ రాహుల్గాంధీని చూసి పొంగిపోయింది కేరళ నర్సు రాజమ్మ వవతిల్. ఆమె.. రాహుల్ గాంధీ జన్మించిన సమయంలో మొదటగా తన చేతుల్లోకి తీసుకున్న నర్సు. రాహుల్ ఇటీవల తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్లో రెండు రోజులు(సోమ, మంగళవారం) పర్యటించిన విషయం తెలిసిందే. రాహుల్ వయనాడ్ వచ్చారని తెలిసి ఆయనను రాజమ్మ కలుసుకుంది. ఇన్నాళ్లకు మళ్లీ రాహుల్ను చూడటంతో ఆమె భావోద్వేగానికి గురైంది. అమితానందానికి లోనై ఆయన బాగుండాలని ఆశీర్వదించింది. అలాగే ఓ స్వీట్ బాక్స్ను బహుకరించింది. తన కుమారుడిని రాహుల్కి పరిచయం చేసింది. అమ్మ (సోనియాగాంధీ) ఎలా ఉన్నారంటూ రాహుల్ను కుశల ప్రశ్నలు అడిగింది. దీనికి సంబంధిన వీడియోను కేరళ కాంగ్రెస్ ట్విటర్లో షేర్ చేయడంతో నర్సను కలిసి రాహుల్ మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢల్లీిలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో రాహుల్ గాంధీ పుట్టగా, రాజమ్మ 1987లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కేరళ తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె కల్లారులో నివసిస్తోంది.