Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రూ. 75 నాణాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం..

ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్న మోదీ..దీనికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగా రూ. 75 నాణాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నాణెంపై పార్లమెంటు కాంప్లెక్స్, కొత్త పార్లమెంట్ భవనం చిహ్నం ఉంటాయని తెలిపింది.. వృత్తాకారంలో ఉండే ఈ నాణెం 44 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి అంచుల్లో 200 గీతలు ఉంటాయని తెలిపింది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో కూడిన లోహంతో ఈ నాణాన్ని తయారు చేసినట్టు వివరించింది. అలాగే, పార్లమెంటు కాంప్లెక్స్ చిహ్నం కింద 2023 అని కూడా ఉంటుందని తెలిపింది..పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి 25 పార్టీలు హాజరవుతుండగా, ప్రధాని ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img