Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రెపో, రివర్స్‌ రెపోలో మార్పు లేదు

ఆర్బీఐ వరుసగా 11వ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా రేపోరేటు 4 శాతంగా కొనసాగనుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని ఆర్బీఐ గుర్తించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జీడీపీ 7.8 శాతం వృద్ధి సాధిస్తుందని లోగడ వేసిన అంచనాలను దిగువకు సవరించింది. వృద్ధి రేటు 7.2 శాతంగానే ఉండొచ్చంటూ తాజా అంచనాలు ప్రకటించింది. అలాగే ధరల పెరుగుదల ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇది గత అంచనా 4.5 శాతమే. 2022`23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం వెల్లడిరచారు. ఆర్థిక రంగానికి మద్దతుగా అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు సర్దుబాటు విధానాన్ని (అకామడేటివ్‌ స్టాన్స్‌) ఆర్బీఐ గత రెండేళ్లకు పైగా కొనసాగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని లెస్‌ అకామడేటివ్‌ గా మార్చుకుంది. తదుపరి రేట్ల పెంపు దిశగా అడుగులు వేయనున్నట్టు దీని ద్వారా ఆర్బీఐ సంకేతం ఇచ్చింది.
మరిన్ని పాలసీ వివరాలు
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌లతో వ్యవస్థలోకి అదనంగా విడుదల చేసిన లిక్విడిటీని వెనక్కి తీసుకోనుంది. రూ.8.5 లక్షల కోట్ల మిగులు లిక్విడిటీని దశలవారీగా తగ్గించనుంది.
ప్రైవేటు వినియోగం, దేశీయ డిమాండ్‌ నిశ్చలంగా, స్తబ్దుగా ఉన్నాయి.
వృద్ధి రేటు క్షీణించే, ద్రవ్యోల్బణం పెరిగే రిస్క్‌ లు ఉన్నాయి.
రెపో రేటును 4 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రెండేళ్లుగా ఇదే రేటు కొనసాగుతోంది.
రివర్స్‌ రెపో రేటు సైతం 3.35 శాతంగానే కొనసాగనుంది.
సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూనే.. ద్రవ్యోల్బణం కట్టడికి దీన్ని ఉపసంహరించుకోవడంపై దృష్టి సారించనుంది.
కరోనా లాక్‌ డౌన్‌ ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. అయితే ఒమిక్రాన్‌ వేవ్‌ సమసిపోవడం వల్ల పొందే లాభాలను భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అందకుండా చేస్తున్నాయని ఆర్బీఐ అభిప్రాయపడిరది.
2022-23 మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.3 శాతం, క్యూ2లో 5 శాతం, క్యూ3లో 5.4 శాతం, క్యూ4లో 5.1 శాతం చొప్పున ఉండొచ్చు. మొత్తం సంవత్సరానికి సగటున 5.7 శాతం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img