Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రేపు జమ్మూకశ్మీర్‌లో మోదీ పర్యటన..భారీ బందోబస్తు ఏర్పాటు

ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో రేపు (24న) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రధాని పర్యటనకు ముందు జమ్మూలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ అధికారి అమరుడయ్యాడు. అనంతరం భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రేపు పంచాయతీ రాజ్‌ దివస్‌ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీరులో 30వేల మందికి పైగా పంచాయతీ సభ్యులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ పోలీసులు, కేంద్ర భద్రతాదళాలతో కలిసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. జమ్మూకశ్మీరులోని సాంబా జిల్లా పల్లి పంచాయతీ నుంచి మోదీ దేశవ్యాప్తంగా వర్చువల్‌ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రైతులు, సర్పంచులు, గ్రామ పెద్దలు తమ ఆదాయాలు పెంచుకునేలా కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img