Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతులకు క్షమాపణ చెప్పండి..!

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి, రైతులకు క్షమాపణలు చెప్పాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ డిమాండ్‌ చేశారు. హర్యానాలోని కర్నాల్‌ టౌన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. ఓ అధికారి రైతుల తలలు పగులగొట్టండి అని లాఠీచార్జి జరుగుతుండగా ఆదేశించడం వీడియోలో రికార్డయ్యింది.ఆ అధికారిపై హర్యానా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గెహ్లాట్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img