దిల్లీలో కాలుష్యం అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పంట వ్యర్ధాలను కాల్చకుండా రైతులను ప్రభుత్వమే నియంత్రించాలని, రైతులపై తాము ఎటువంటి ఆంక్షలు విధించబోమని కోర్టు పేర్కొంది. రైతుల్ని శిక్షించడం తమ విధి కాదని, కనీసం వారం రోజుల పాటు పంట వ్యర్ధాలను కాల్చవద్దు అని రైతుల్ని అభ్యర్థించాలని కేంద్రానికి చెప్పినట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రైతులు కాల్చుతున్న పంటల వల్ల ఢల్లీి పరిసర ప్రాంతాల్లో కాలుష్యం మరింత ఉదృతమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇస్తున్న డేటా గందరగోళం సృష్టిస్తోందన్నారు. టీవీల్లో జరుగుతున్న చర్చలే తీవ్ర కాలుష్యాన్ని సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. టీవీ చర్చల్లో ప్రతి ఒక్కరికీ తమ ఎజెండా ఉందని, కానీ తాము మాత్రం ఆ సమస్యలకు కోర్టులో పరిష్కారాలు వెతుకుతున్నామని అన్నారు. రైతుల బాధల్ని అర్థం చేసుకోవాలని, వాళ్లెందుకు పంట వ్యర్ధాలను దగ్ధం చేస్తున్నారని, వాటి గురించి ఆలోచించేవాళ్ల్ల్లు లేరని జస్టిస్ సూర్య కాంత్ అన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో నిద్రపోయేవాళ్లు కూడా రైతుల్ని నిందిస్తున్నారని, చిన్న చిన్న పొలాలు ఉన్న రైతులు .. వ్యర్ధాల తొలగింపునకు మెషిన్లు ఎలా కొనగలరని పేర్కొన్నారు.చిన్న చిన్న పొలాలు ఉన్న రైతులు .. వ్యర్ధాల తొలగింపునకు మెషిన్లు ఎలా కొనగలరని అన్నారు.