Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రోడ్లపై కొత్తిమీర నాటి సీపీిఐ వినూత్న నిరసన

విశాలాంధ్ర`పెనుకొండ :
అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో గురువారం సీపీఐ మండల కార్యదర్శి శీల నారాయణస్వామి నేతృత్వంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు సంవత్సరాల నుంచి రోడ్ల నిర్మాణం చేపట్టక, పాత రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలుగా ఏర్పడి రోడ్లు ప్రయాణానికి అనుకూలంగా లేనందున ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంతల మాయమైన రోడ్లపై కొత్తిమీర నాట్లు వేసి సీపీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు షబ్బీర్‌, వెంకటేశ్‌, నూర్‌ భాషా చేనేత కార్మిక సంఘం నాయకులు దామోదర్‌ బాషా తదితరులు నాయకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img