లఖింపూర్ ఖేరీ కేసులో మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమిత్ జైస్వాల్(బీజేపీ నాయకుడు), శిశుపాల్, నందన్ సింగ్ బిస్త్, సత్య ప్రకాశ్ త్రిపాఠిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యప్రకాశ్ త్రిపాఠి నుంచి లైసెన్స్డ్ రివాల్వర్, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 3న లఖింపూర్ ఖేరీలో కంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా..రోడ్డు పక్కన నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను తన వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనతోపాటు తర్వాత జరిగిన అల్లర్లలో మొత్తం 8 మంది మరణించారు. ఈ కేసులో అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.