లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ఈ ఘటనపై హైకోర్టు విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేర్లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్ కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ జర్నలిస్టు ఈ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.