Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

లాలూ ప్రసాద్‌కు బెయిల్‌ మంజూరు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు బెయిల్‌ మంజూరయింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జార?ండ్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. డొరండ ట్రెజరీ కేసులో సీబీఐ ఆయనకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, లూలూకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని చెప్పారు. ఆరోగ్య సమస్యలతో పాటు సగం శిక్షా కాలం జైల్లో గడపడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లూలుకు ఊరటను కలిగించిందని తెలిపారు. రూ. 10 లక్షల జరిమానా, రూ. 1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img