Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి.. పలువురికి గాయాలు

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘటన
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం సాజియాన్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. గాయపడిన వారిని మండిలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు లోయలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img