Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వరవరరావుకు బెయిల్‌ మంజూరు

ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవరరావుకు సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. భీమా కొరెగావ్‌ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్‌ బెయిల్‌గా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్‌ కోర్టు అధికార పరిధిలోని ప్రాంతం నుంచి వెలుపలికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా తెలిపింది. కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా వివరించింది. ఆయన వయసు 82 సంవత్సరాలు కావడం, అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు ఉండటం వల్ల వైద్యపరమైన కారణాల మేరకు ఈ బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చికిత్సకు సంబంధించిన వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు తెలియజేయాలని వరవరరావును ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img