దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,529 కరోనా కేసులు నమోదవ్వగా..311 మంది మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 3,37,39,980కు చేరింది. ఇందులో 3,30,14,898 మంది కరోనా నుంచి బయటపడగా, మరో 4,48,062 మంది బాధితులు ప్రాణాలొదిరారు. దేశంలో ప్రస్తుతం 2.77 లక్షల కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలోనే ఉన్నాయి.రాష్ట్రంలో నిన్న 12,161 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. మరో 155 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. నిన్న ఒక్కరోజే 65,34,306 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొన్నది.