మధ్యప్రదేశ్ విద్యుత్శాఖ నిర్వాకం..ఆస్పత్రి పాలైన ఇంటిఓనర్…
దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మోత మోగుతోంది. మధ్యతరగతి కుటుంబీకులు విద్యుత్ బిల్లు వస్తోందంటే ఆందోళన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 వేల కరెంటు బిల్లు వస్తేనే దిగులు పడే మధ్యతరగతి వాసులు ఏకంగా 3 వేల కోట్ల రూపాయలకు పైగా కరెంట్ బిల్లు వస్తే..ఏమైపోతారో ఒక్కసారి ఊహించొచ్చు.మూడు గదుల పోర్షన్కి అక్షరాలా మూడు కోట్ల రూపాయల పై చిలుకు బిల్లును చూసి గుండె ఆగినంత పనైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్వాలియర్ నగరంలోని శివ విహార్ కాలనీలో సంజీవ్ కంకనే తన తండ్రితో కలిసి నివసిస్తున్నారు. జూన్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లు వచ్చింది. ఆ బిల్లులో అక్షరాలా రూ. 3,419 కోట్లు చెల్లించాల్సిందిగా ఉంది. ఈ బిల్లు చూసిన కంకనే తండ్రి సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మధ్యక్షేత్ర విద్యుత్ విత్రన్ కంపెనీ (ఎంపిఎంకెవివిసి) పోర్టల్ లో మరోసారి చెక్ చేయించినా అంతే బిల్లు వచ్చిందని అన్నారు. ఈ ఘటనపై కంకనే ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేశారు. మానవ తప్పిదం కారణంగా ఈ బిల్లు తప్పుగా అచ్చయ్యిందని అధికారులు తెలిపారు. యూనిట్ల స్థానంలో వినియోగదారుని మీటర్ నెంబర్ని నమోదు చేశారని, దీంతో చెల్లించాల్సిన మొత్తం రూ.1300కి బదులు రూ. 3,419 కోట్లుగా వచ్చిందని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో అధికారులు తెలిపారు.