Friday, April 19, 2024
Friday, April 19, 2024

విజయవాడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. హాజరైన గవర్నర్‌, సీఎం జగన్‌

గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.ఏపీలో ప్రజల కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గవర్నర్‌ ప్రశంసించారు. డీబీటీ ద్వారా నవరత్నాలు అర్హులై ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. కుల,మత, ప్రాంతాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు అందరూ ప్రతి ఇంటికీ వెళ్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు బిశ్వభూషణ్‌.ముఖ్యంగా విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. అమ్మఒడితో పాటూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని వివరించారు. జగనన్న విద్యాకానుక ద్వారా పుస్తకాలు, దుస్తులు, స్కూల్‌ కిట్‌ అందిస్తున్నారన్నారు గవర్నర్‌.
ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందతున్నాయని.. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక ద్వారా రూ.2750 సాయం అందిస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం చాలా పథకాలు అమలు చేస్తున్నారని.. త్వరలో సంచార పశువైద్య క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయని.. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారని వివరించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img