దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. . ఏడు రోజుల క్వారెంటైన్ రూల్ను ఎత్తివేశారు. అయితే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు సెల్ఫ్ మానిటర్ చేసుకోవాలని కేంద్రం కొత్త ఆదేశాల్లో పేర్కొన్నది. సోమవారం నుంచి ఈ కొత్త గైడ్లైన్స్ అమలులోకి రానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారిపై గత ఏడాది పలు ఆంక్షలను కేంద్రం విధించిన విషయం తెలిసిందే.