నీట్ పీజీ మెడికల్ సీట్ల భర్తీపై భారత వైద్య మండలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు… కేంద్ర ప్రభుత్వం, భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలిండియా వైద్య కళాశాలల్లో 1,456 పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్న వైనంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, పీజీ మెడికల్ సీట్ల భర్తీ, ఖాళీలకు సంబంధించిన అఫిడవిట్ను ఈ రోజే దాఖలు చేయాలని మెడికల్ కౌన్సిల్కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై రేపే విచారణ చేపట్టనున్నట్లు కూడా వెల్లడిరచింది. బుధవారం నాటి విచారణ సందర్భంగా మెడికల్ కౌన్సిల్తోపాటు కేంద్ర ప్రభుత్వం తీరుపై సర్వోన్నత న్యాయస్థాన్టం కీలక వ్యాఖ్యలు చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం చేయాలనుకుంటున్నారని వైద్య మండలిని కోర్టు ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా? అంటూ వైద్య మండలితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. పరిస్థితిని చక్కదిద్దకపోతే వైద్య మండలి డీజీని కోర్టుకు పిలిచి ఆర్డర్ పాస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.