ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని నార్పలలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.. ఈ సభలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని నార్పల వేదికగా జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాలో జమచేస్తారు. దీంతో.. రాష్ట్రంలో జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు కలిపి 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమచేసినట్లవుతుంది.