https://www.fapjunk.com https://pornohit.net getbetbonus.com deneme bonusu veren siteler bonus veren siteler popsec.org london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg getbetbonus.com deneme bonusu veren siteler bonus veren siteler getbetbonus.com istanbul bodrum evden eve nakliyat pendik escort anadolu yakası escort şişli escort bodrum escort
Aküm yolda akü servisi ile hizmetinizdedir. akumyolda.com ile akü servisakumyolda.com akücüakumyolda.com akü yol yardımen yakın akücü akumyoldamaltepe akücü akumyolda Hesap araçları ile hesaplama yapmak artık şok kolay.hesaparaclariİngilizce dersleri için ingilizceturkce.gen.tr online hizmetinizdedir.ingilizceturkce.gen.tr ingilizce dersleri
It is pretty easy to translate to English now. TranslateDict As a voice translator, spanishenglish.net helps to translate from Spanish to English. SpanishEnglish.net It's a free translation website to translate in a wide variety of languages. FreeTranslations
Friday, March 29, 2024
Friday, March 29, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సిందే

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ఏఐటీయూసీ ఆందోళనలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ, ఏఐటీయూసీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా, 30 న జరిగే కార్మిక గర్జనను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో పెందుర్తి కూడలిలో సోమవారం జరిగిన సంఫీుభావ దీక్షలో టీడీపీ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ (ఎన్‌డి) తదితర పార్టీల నేతలు పాల్గొని సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు మనందరి హక్కు అని, ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపిన మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సీపీఎం పెందుర్తి ఏరియా కార్యదర్శి బి రమణి, సీపీిఐ ఎంఎల్‌ఎన్‌డి నాయకురాలు కె నిర్మల తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు లేకపోయినా, సొంత గనులు కేటాయంచకపోయినా 35 వేల మంది పర్మినెంట్‌ కార్మికులకు ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ, 50 వేల కోట్ల రూపాయలు పన్నులు కడుతున్నారన్నారు. కేవలం 5 వేల కోట్ల రూపాయల మూలధనంతో ఇంత అభివృద్ధిలో నడుస్తున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటన చేసి జనవరి 27 కి రెండు సంవత్సరాల పూర్తవుతుందని, ఈ సందర్భంగా జనవరి 30న ఉక్కు నగరంలో నిర్వహించే కార్మిక గర్జనలో విశాఖ జిల్లా ప్రజలు పాల్గొని నిరసన తెలిపి, కార్మికులకు అండగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా అన్ని పరిశ్రమలను అమ్మే పనిలో ఉందని, ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం వంటి వాటిని అమ్మేసిందని అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ప్రధాని దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని వారు డిమాండ్‌ చేశారు. .సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ దీక్ష శిబిరంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ విమల, ఎస్‌ కె రెహమాన్‌, కె సత్యనారాయణ, వై రాంబాబు, ఎన్‌ ఆసిరినాయుడు, సిపిఎం నాయకులు సూర్య ప్రకాష్‌, సిపిఐ ఎం ఎల్‌ ఎన్‌ డి యు ఇందిర ,వెంకట లక్ష్మీ, రూప, జీవీఎంసీ టీడీపీ ప్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ బల్లా శ్రీనివాస్‌, రెడ్డి నారాయణరావు, వేగి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
27న మహాగర్జనకు తరలిరండిజంగాల అజయ్‌కుమార్‌ విశాఖ ఉక్కు పరిరక్షణకు ఈ నెల 27న విశాఖ నగరంలో జరగనున్న మహాగర్జనను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దానికి మద్దతుగా జనవరి 24వ తేదీన తెనాలి, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల వారు తెనాలి రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని, 25న గుంటూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల వారు గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు సామూహిక నిరాహార దీక్షలు చేపటనున్నట్లు తెలిపారు. సోమవారం తెనాలి గాంధీనగర్‌ సీపీఐ కార్యాలయంలో జరిగిన సీపీఐ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమం ఉధృతంకేవీవీ ప్రసాద్‌
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని గాంధీ పార్కు వద్ద దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని,లేనిపక్షంలో ఉద్యమం ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, టీఎన్‌టీయూసీ నాయకులు గొట్టిపాటి జనార్థన్‌, ఏఐటీయూసీ నాయకులు కాసా రాంబాబు, కౌలు రైతు సంఘం నాయకులు రాధాకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు ఉలవలపూడి రాము, గోపాలరావు, సీఐటీయూ జిల్లా నాయకులు డి.శివకుమారి, ఏఐటీయూసీ నాయకులు బూదాల శ్రీనివాసరావు, మునుగోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లాలో
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యాన మైలవరం, తిరువూరు పట్టణాల్లో నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ శిబిరాలను సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుడ్డి రమేష్‌, సీహెచ్‌ దుర్గా కోటేశ్వరరావు, తిరువూరు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి తూము కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, షేక్‌ నాగుల్‌ మీరా, కొత్తపల్లి సుందరరావు తదితరులు పాల్గొన్నారు.
నూజివీడులో: విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ సీపీఐ, ఏఐటీయుసి చేపట్టిన దీక్షలకు సంఫీుభావంగా సోమవారం నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, ఏఐటియుసి కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని రామారావు, ఏఐటీయుసీ ఏలూరు జిల్లా కన్వీనర్‌ బండి వెంకటేశ్వరరావు, సీపీిఐ సీనియర్‌ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు, నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ భీమవరం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఏఐటీయూసీ భీమవరం ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సీతారాం ప్రసాద్‌, సికిలే పుష్పకుమారి, జిల్లా సమితి సభ్యులు నామాన వెంకటేశ్వరరావు తదితరులుపాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో: రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో: కాకినాడ జిల్లా పెద్దాపురంలో సోమవారం రెవిన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం ఎదుట సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు పెద్దిరెడ్డి సత్యనారాయణ (పీిఎస్‌), సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img