Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వెయ్యి దిగువకు కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గింది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 937 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,61,516కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,515 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,16,492 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,509కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98. 78శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.73 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img