Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.21,424 కోట్లు.. డీబీటీ పథకాలకు రూ.54,428 కోట్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గురువారం వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఉదయం 10 గంటలకు సాధారణ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడుతుండగా.. టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో వారిని సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని నవరత్నాలకు నిధుల కేటాయింపులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉన్న పథకాలను బలపరిచేలా.. మరింత మందికి అవకాశం ఇచ్చేలా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.

⍟ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రూ.2,79,279 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లుగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ.22,316కోట్లు, ద్రవ్యలోటు రూ.54,587 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. జీఎస్డీపీలో లోటు 3.7 శాతంగా పేర్కొన్నారు.

⍟ జగనన్న చేదోడు పథకం కోసం రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ.350 కోట్లు కేటాయింపు.
అమెజాన్ మెగా ఫ్యాషన్ డేస్ ప వాచీలు డ స్మార్ట్ వాచీలపై కనీసం 60% తగ్గింపు

⍟ జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.2450కిపైగా కోట్లు ఖర్చుచేసిందని ఆర్థిక మంత్రి తెలిపారు.

⍟ స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం కోసం రూ.1,191 కోట్లు కేటాయింపు.

⍟ మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరిలను అభివృద్ధి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు.

⍟ పాఠశాల విద్య కోసం రూ.29,062 కోట్లు, ఉన్నత విద్య కోసం 2,600 కోట్లు

⍟ వైఎస్సార్ కళ్యాణమస్తు కోసం రూ.200 కోట్లు. ఈబీసీ నేస్తం కోసం రూ.650 కోట్లు.

⍟ నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకుపైగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన.

⍟ వైఎస్సాఆర్ చేయూత పథకం కోసం రూ.5,000 కోట్లు కేటాయింపు.. మహిళ, శిశు సంక్షేమం కోసం రూ.3,950 కోట్లు కేటాయింపు.

⍟ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపు… రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు

⍟ పాఠశాలల్లో నాడు-నేడు పనుల కోసం రూ. 3,500 కోట్లు కేటాయింపు

⍟ గడప గడపకూ మన ప్రభుత్వం కోసం రూ.532 కోట్లు

⍟ ప్రత్యక్ష బదిలీ ద్వారా రూ.27,065 కోట్లు బదిలీ, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.4.25 కోట్ల మందికి ప్రయోజనం

⍟ వైఎస్సాఆర్ అభయ హస్తం పథకానికి రూ.21,275 కోట్లు కేటాయింపు.

⍟ పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖలకు రూ.1,200 కోట్లు.. రైతు భరోసాకు రూ.4,000 కోట్టు

⍟ మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.1,848 కోట్లు.. హోంశాఖకు రూ.8,206 కోట్లు కేటాయింపు

⍟ 154 నియోజకవర్గాల్లో జంతు వ్యాధుల నిర్దారణ కేంద్రాలు.. ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6,165 కోట్లు

⍟ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.348 కోట్లు.. ఎస్టీల కార్పొరేషన్‌కు రూ.2,428 కోట్లు, క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు

⍟ జగనన్న విద్యా దీవెన కోసం రూ.2,841.67 కోట్లు.. యువజన, పర్యాటక శాఖకు రూ.1,191 కోట్లు

⍟ అమ్మ ఒడి కోసం రూ.6,500 కోట్లు, ఎనర్జీ రంగాన్ని రూ.6,456 కోట్లు.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు రూ.3,887 కోట్లు

⍟ షెడ్యూల్ కులాల సంక్షేమానికి రూ.20,007 కోట్లు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి రూ.6,887 కోట్లు కేటాయింపులు

⍟ వైఎస్సార్చేయూత రూ.5,000, వైఎస్సార్ ఆసరాకు 6,500 కోట్లు కేటాయింపు.

⍟ వైస్సార్ వాహన మిత్రకు రూ.275 కోట్లు.. జగనన్న చేదోడు రూ.350 కోట్లు. వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.220 కోట్లు

⍟ నీటి పారుదల శాఖకు రూ.11,908 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.9,000 కోట్లు

⍟ పేదల ఇళ్ల నిర్మాణం కోసం రూ.5,600 కోట్లు కేటాయింపు.. మైనార్టీల సంక్షేమం కోసం రూ.4,207 కోట్లు

⍟ పురపాలక, పట్టణాభివృద్ధికి రూ.9,840 కోట్లు.. కాపు సంక్షేమానికి రూ.4887 కోట్లు..

⍟ రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్సార్ కాపు నేస్తం రూ.550 కోట్లు

⍟ మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు, లా నేస్తం కోసం రూ.17 కోట్లు, జగనన్న తోడు కోసం రూ.35 కోట్లు కేటాయింపు.

⍟ జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు.. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.1,212 కోట్లు

⍟ డ్యాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

⍟ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేశారు. మొత్తం డీబీటీ స్కీంలకు రూ.54 వేల కోట్లకుపైగా కేటాయించారు.

⍟ వైద్యం, ఆరోగ్యం కోసం రూ.15,882 కోట్లు.. జగనన్న విద్యా కానుకకు రూ.560 కోట్లు

⍟ ధరల స్థిరీకరణ నిధికి రూ.3,000 కోట్లు.. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,882 కోట్లు

⍟ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఆశలను అడ్డుకోవడం తగదని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చూడలేదని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని.. అందుకు తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

⍟ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీఎం జగన్ అసహనానికి గురయ్యారు. అటువంటి వారిని సభ నుంచి బయటకు పంపే చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. ఇది చాలా విచారకరమని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణ, బెందాళమ్ అశోక్ తదితరులను ఒక రోజు సస్పెండ్ చేశారు.

⍟ స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతితో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ఏవిధంగా కష్టపడి పనిచేసిందో మంత్రి వివరించారు. అధికారులు, ప్రభుత్వం కలిసి ఓ కుటుంబంలా పనిచేశామని వివరించారు. ాపలికెడిది భాగవతమట.. పలికించేది రామభద్రుడట్ణ అంటూ ప్రసంగం ప్రారంభించారు. సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలపడంతో కాసేపట్లో సభలో స్పీకర్ అనుమతితో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు.

⍟ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీఎం జగన్ అసహనానికి గురయ్యారు. అటువంటి వారిని సభ నుంచి బయటకు పంపే చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను కోరారు.

⍟ కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కర్నూలులో డాక్టర్ మధుసూదన్, శ్రీకాకుళంలో నర్తు రామారావు, పశ్చిమ గోదావరిలో వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్‌లు గెలుపొందారు.

⍟ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర క్యాబినెట్.. వార్షిక బడ్జెట్ 2023-24కు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలోనే ఉప లోకాయుక్త నియామకంలో మార్పులకు సంబంధించిన డ్రాప్ట్‌ బిల్లుకు ఆమోదం వేశారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతారు.

⍟ అంతకు ముందు అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

⍟ బడ్జెట్ గురించి ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు.

⍟ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయిన బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం­ద్రనాథ్‌ 2023ఉ24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. దాదాపు రూ.2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. మహిళ సాధికారత కు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మహిళలు, పిల్లలకు ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.

⍟ శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు.

⍟ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం కోసం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయ్యింది. అంతకు ముందు బడ్జెట్‌ కాపీతో సచివాలయానికి చేరుకున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. బడ్జెట్‌ ప్రతులకు పూజలు నిర్వహించారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలిపారు.

⍟ ఏపీలో విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 19న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేయనుంది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం డబ్బుల్ని బటన్ నొక్కి అకౌంట్‌లలోకి విడుదల చేయనున్నారు. పూర్తి కథనం⍟ తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. శ్రీ‌వారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. దీంతో మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను రద్దు చేసింది టీటీడీ. ఈ కారణంగా మార్చి 20, 21న వీఐపీ బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.. పూర్తి కథనం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img