Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ.. ప్రొద్దుటూరులో పోస్టర్ల కలకలం

  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీమంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తెలుగుదేశం పార్టీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని స్వాగతం పలుకుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవిల ఫోటోలతో కూడిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వివరాల్లోకెళితేౌ. ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత పోస్టర్లు కలకలం సృష్టించాయి. వైఎస్ సునీత రాజకీయ రంగప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రొద్దుటూరు పట్టణమంతా పోస్టర్లు అతికించారు.వైఎస్ సునీత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు వాల్ పోస్టర్లలో వైఎస్ వివేకానంద రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొంత మంది టీడీపీ ముఖ్య నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. తెల్లవారే సరికి పట్టణమంతా వాల్ పోస్టర్లు చూసిన ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున చర్చ పెట్టారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎర్ర మునిరెడ్డి కాలనీ, హోమస్ పేట, మున్సిపల్ పార్కు, వివేకానంద క్లాత్ మార్కెట్ కూడళ్లలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img