Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైద్య పరీక్షల కోసం విదేశాలకు సోనియాగాంధీ..

ఆమెకు తోడుగా వెళ్లనున్న రాహుల్‌, ప్రియాంక!
వైద్య పరీక్షల కోసం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. ఆమెకు తోడుగా రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా తెలియజేసింది. సోనియాగాంధీ మెడికల్‌ చెకప్‌ కోసం విదేశాలకు వెళ్తున్నారని… ఇదే సమయంలో అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి వద్దకు కూడా ఆమె వెళ్తారని ఒక ప్రకటనలో జైరాం రమేశ్‌ తెలిపారు.సెప్టెంబర్‌ 4న ఢల్లీిలో జరిగే ‘మెహంగాయ్‌ పర్‌ హల్లా బోల్‌’ ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు. మరోవైపు, సెప్టెంబర్‌ 7న కన్నియాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు కాంగ్రెస్‌ చేపట్టే ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రారంభం కానుంది. అంతేకాదు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోబోతున్న తరుణంలో సోనియా మెడికల్‌ చెకప్‌ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు, సోనియా చెకప్‌ కోసం ఏ దేశానికి వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారనే విషయాలపై మాత్రం కాంగ్రెస్‌ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img