వ్యవసాయం ఖరీదైన పనిగా మారిపోయిందని..ఎరువులు, విత్తనాల ధరలే దీనికి ఉదాహరణ అని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. లఖింపూర్ ప్రమాదంలో చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలను శుక్రవారం ఆమె కలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో జరిగిన ప్రమాదం కేవలం నలుగురు రైతులకు సంబంధించిన సమస్య కాదని, అది బుందేల్ఖండ్ మొత్తానికి సంబంధించిన సమస్యని అన్నారు. రైతులు పండిరచిన పంటకు ధర ఉండదు కానీ ఎరువుల ధరలు మాత్రం ఏటా పెరుగుతూనే ఉన్నాయన్నారు. రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, తమ గోడు ఎన్నిసార్లు వెల్లగక్కినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రైతులు నెలల తరబడి రోడ్ల మీద ఉన్నా పట్టించుకోవడం లేదని, పైగా రైతులపైకి వాహనాల్ని ఎక్కించి తొక్కించి చంపుతున్నారని మండిపడ్డారు.