Friday, April 19, 2024
Friday, April 19, 2024

వ్యాక్సినేషన్‌ పూర్తయినా..87వేల మందికి కరోనా

కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారిలో అత్యధికంగా 46శాతం కేసులు కేరళలోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. కేరళలో టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 80,000 కరోనా కేసులు నమోదు కాగా, రెండో డోసు తీసుకున్న వారిలో 40,000 మందికి కరోనా సోకినట్లు తెలిపింది. కేరళలోని వయనాడ్‌లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నేడు ఏకంగా 21,427 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 179 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img