Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికే.. ఈ పర్యటన


అమెరికా పర్యటనకు ముందు ప్రకటించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అగ్రదేశం అమెరికాకు పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్‌లో అమెరికా పర్యటన ఉద్దేశాన్ని వెల్లడిరచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానం మేరకు తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు వెల్లడిరచారు. అమెరికాతో సహా ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ పర్యటన మంచి సందర్భమని ట్వీట్‌లో పేర్కొన్నారు. మూడురోజుల అమెరికా పర్యటనలో క్వాడ్‌ నేతల సదస్సులో పాల్గొననున్నట్లు మోదీ తెలిపారు. అధ్యక్షుడు బైడెన్‌, ఆసీస్‌ ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు.ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్‌ మారిసన్‌, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోనూ ఆయన భేటీకానున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో రెండు దేశాల మధ్య సహకారంపై ఆమెతో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img