. పెండిరగ్లో 4 డీఏలు
. ప్రతి ఉద్యోగికీ రూ.10వేల బకాయి
. నిలిచిన రూ.3వేల కోట్ల ప్రయోజనాలు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లపై జగన్ సర్కారు దగాకోరు విధానాల్ని కొనసాగి స్తోంది. సంక్రాంతి పండుగకు కనీసం ఒక్క డీఏ ఇస్తామంటూ సీఎం జగన్ సమక్షంలో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. ఎంతో కాలంగా డీఏల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులకు ఇది చేదు కబురైంది. పండుగనాడు వారి ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమవకపోవడంతో తీవ్ర నిరుత్సాహం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఉన్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు 2021 జనవరి, 2021 జులై, 2022 జనవరి, 2022 జులైకి సంబంధించి నాలుగు డీఏలు పెండిరగ్లో ఉన్నాయి. 2023 జనవరితో కలిపి ఐదవుతాయి. ఇందులో కనీసం ఒక్క డీఏ కూడా సంక్రాంతికి ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం దగా చేసిందని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తుతు న్నాయి. డీఏల రూపంలో ప్రస్తుతం పెండిరగ్లో ఉన్న నాలుగు డీఏలు కలిపి (ఒక్కో డీఏకు రూ.2,500)రూ.10వేల చొప్పున రావాల్సి ఉంది. ఈ ఏడాది కేంద్రం కొత్త డీఏ ప్రకటిస్తే, దాంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున డీఏ ప్రయోజనం ఉపాధ్యాయులకు చెందాల్సి ఉంది.
రూ.1800కోట్ల పీఆర్సీ బకాయిలు దీనికితోడు ఉద్యోగ, ఉపాధ్యా, కార్మిక, పెన్షనర్లు అందరికీ పీఆర్సీ బకాయిలు రూ.1800 కోట్లు రావాల్సి ఉంది. సగటున ప్రతి ఉద్యోగికి పీఆర్సీ ప్రయోజనాల్ని పరిశీలిస్తే రూ.లక్ష నుంచి 2లక్షలు రావాల్సి ఉంది. జిల్లా పరిషత్(జెడ్పీ) పీఎఫ్లు పెండిరగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవిత బీమా(ఏపీ జీఎల్ఐ)కి చెందిన ప్రయోజనాలు, రుణాలు నిలిచిపోగా, ఏడాది నుంచి ఉద్యోగుల ఆర్జిత (సరెండర్) సెలవులు నిలిచి పోయాయి. మొత్తంగా పీఆర్సీ, డీఏ, ఆర్జిత సెలవులు తదితరాలు అన్నీ కలిపి ఉద్యోగులకు రూ.3వేల కోట్ల ప్రయోజనాలు పెండిరగ్లో ఉండి పోయాయి. దీనిపై ప్రశ్నించిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలపై అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విమర్శలున్నాయి. నాడు పీఆర్సీ ప్రయోజనాల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన చలో విజయవాడ గర్జనతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరైంది. అప్పట్నుంచి ప్రత్యేకించి ఉపాధ్యాయుల ప్రయోజనాలను గాలికొది లేసింది. కనీసం సీఎంతో జరిగే ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశా లకు సైతం ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకుండా వివక్ష చూపు తోంది. ఉద్యోగుల డీఏ అనేది ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడిరది కాదని అది తమ హక్కు అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎందుకీ నిర్లక్ష్యం?
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రధాన భూమిక వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తూ, మరో వైపు ఆ సంక్షేమ పథకాలను నిర్వహణకు కృషి చేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలపై చిన్న చూపు చూస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపైనా ఇప్పటివరకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సీపీఎస్ రద్దును అమలు చేయకుండా, తెరపైకి గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెచ్చి ఉద్యోగ, ఉపాధ్యాయులను కొంతకాలంపాటు గందరగోళానికి గురిచేసింది. దానిపై పెద్దఎత్తున తిరుగుబాటు రావడంతో సీపీఎస్, జీపీఎస్ స్థాయిలో మధ్యేమార్గంగా మరో పెన్షన్ విధానం త్వరలో తీసుకొస్తా మంటూ జగన్ ప్రభుత్వం దాటవేసింది. సీపీఎస్ రద్దు చేయాలంటూ లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్ధమైతే, వారిపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసింది. నాడు చలో విజయవాడ విజయవంతానికి పరోక్షంగా సహకరించారన్న అక్కసుతో స్పెషల్ బ్రాంచి, నిఘా విభాగాలను వివిధ ప్రాంతాలకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఉపాధ్యాయుల పదోన్నతుల్లోనూ ఇష్టానుసారంగా నిబంధనలను తీసుకొచ్చింది. మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు కన్నెర్రజేస్తున్నారు.