Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సిండి‘కేట్లు’!

500 బార్లకు ఈ`వేలం
కడపలో అత్యధికంగా రూ.1.89 కోట్లు
వైసీపీ నేతల పోటాపోటీ
బ ధరలు పెరగకుండా జాగ్రత్తలు
పోటీదారులకు తాయిలాలు
కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రెండు రోజులపాటు బార్లకు నిర్వహించిన ఈవేలంలో వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచరులే అధికంగా వాటిని కైవసం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో మద్యంషాపు రూ.1.47 కోట్లు పలికింది. ఇదే జిల్లా అద్దంకిలో రూ.1.37 కోట్లకు పాడారు. మార్కాపురంలో రూ.1.17 కోట్లు, చీమకుర్తిలో రూ.1.7కోట్లకు వేలం పాడారు. ఈనెల 30న ప్రారంభమైన మద్యం ఈ`వేలం టెండర్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. రెండో రోజు వైసీపీ ప్రజాప్రతినిధుల బెదిరింపులతో వ్యాపారులు వెనక్కి తగ్గారనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రధాన నగరాలు/పట్టణాల్లో వైసీపీ నేతల అనుచరులే బార్లను దక్కించుకున్నారు. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు ఆదాయం తగ్గింది. బార్ల ఈ-వేలంలో అత్యధిక ప్రాంతాల్లో రాజీ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారారనే ప్రచారముంది. ఈ-వేలంలో ధర పెరగకుండా వ్యాపారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. కోస్తాలోని ఆరు జిల్లాల్లో 500 బార్లకు ఈ-వేలం వేయగా, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, కాకినాడ, అమలాపురంలో చాలా మంది సిండికేట్‌గా మారినట్లు సమాచారం.
కాకినాడలో పోటీదారులకు రూ.20 లక్షలు
కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో 11 బార్లకు వేలం వేయగా, కేవలం 11 మంది హాజరయ్యారు. ప్రభుత్వ ధరకు కేవలం 2 లక్షలే అదనంగా వ్యాపారులు వేలం పాడారు. ముందే పోటీ నుంచి ఏడుగురిని వైసీపీ కీలక నేత తప్పించినట్లు, ప్రతి ఒక్కరికీ రూ.20 లక్షల చొప్పున మామూళ్లు ఇచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్‌ జిల్లాలో బార్ల ఈ-వేలం ప్రక్రియ ముగిసింది. తిరువూరు మినహా అన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారారు. తిరువూరులో అత్యధికంగా రూ.59 లక్షలకు షాపును దక్కించుకున్నారు. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 110 బార్లకు గానూ 109 బార్లకు వేలం వేశారు. ప్రభుత్వం రూ.50 లక్షలు నిర్ణయించగా, రూ.54 లక్షలకు వ్యాపారులు పాడారు. ప్రభుత్వ ధర కంటే రూ.4 లక్షలు మాత్రమే అధికంగా ఆదాయం వచ్చింది. తొలి రోజు బార్ల ఈవేలానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 323 బార్లకు ఈవేలం నిర్వహించగా మొత్తం రూ.258 కోట్ల ఆదాయం వచ్చింది. రాయలసీమ జిల్లాల్లో బార్ల వేలంలో ఎక్కువగా వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. కడపలో అత్యధికంగా ఓ బార్‌కు రూ.1.89 కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులతో వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రధాన నగరాల్లో వైసీపీ నేతల అనుచరులకే బార్ల టెండర్లు ఇచ్చారు. సాధ్యంకాని ప్రాంతాల్లో భాగస్వామ్యం ఇవ్వాలని బెదిరించినట్లు సమాచారం. ఈ` టెండర్ల వ్యవహారంలో సిండికేట్‌ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండి పడిరదని వ్యాపారులు భావిస్తున్నారు. కొందరు వైసీపీ కీలక నేత తెరవెనుక చక్రం తిప్పినట్లు ప్రచారం జోరందుకుంది.
అటకెక్కిన జగన్‌ వాగ్దానం
అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామంటూ నాడు జగన్‌ ఇచ్చిన వాగ్దానం, మూడేళ్ల తర్వాత అటకెక్కింది. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తామంటూ హామీ ఇచ్చి, నేడు ప్రజలను దగా చేశారనే విమర్శలున్నాయి. విచ్ఛలవిడిగా బార్లకు అనుమతులిస్తూ, మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అసలు మా మేనిఫెస్టోలో మద్య నిషేధమే లేదని సాక్షాత్తూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ బుకాయించడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా దుమారం రేగుతోంది. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా ప్రకటించుకున్న మేనిఫెస్టోను వైసీపీ నేతలే మడత పెట్టేశారంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img